
బాన్సువాడ, వెలుగు : బాన్సువాడ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ను హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో కలిసిశాలువా కప్పి సన్మానించారు. అంబేద్కర్ సంఘం డివిజన్ నాయకుడు ప్రశాంత్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దళితులకు పెద్దపీట వేయడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహులు, మాజీ సర్పంచ్ కొత్తాబాద్ సాయిలు, డివిజన్ నాయకులు మన్నె నాగభూషణం, హన్మాజీపేట్ సాయిలు, పట్టణ మాజీ అధ్యక్షుడు దొనకంటి వినోద్ కుమార్, పోచారం ఉపాధ్యక్షుడు పరిమళ సాయిలు, సోమేశ్వర్ యువ నాయకుడు బయ్యని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.