
హైదరాబాద్ సిటీ, వెలుగు : భీమ్ సైనిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి ఆత్మీయ సన్మానం చేశారు. ఆదివారం హైదరాబాద్లోని సోమజిగూడ ప్రెస్క్లబ్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు కలకోట సత్యనారాయణ, సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం తన తండ్రి కాకా వెంకటస్వామి ఎంతో కృషి చేశారని చెప్పారు. కాకా స్ఫూర్తితో తానూ పని చేస్తానని, ఆయన పేరు నిలబెడతానని చెప్పారు. కాకా కుటుంబంపై పెద్దపల్లి ప్రజలకు ఎంతో ప్రేమ ఉందన్నారు. -