మంత్రిగా తొలిసారి ఓటు వేశా

మంత్రిగా తొలిసారి ఓటు వేశా

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు కరీంనగర్ జిల్లాలో ఎన్నికలు జరుగుతున్నాయి. కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఎన్నో సార్లు ఓటు వేశాను.. కానీ, మంత్రిగా మాత్రం తొలిసారి ఓటు వేశాను. ఈ ఎన్నికలు అభివృద్ధికి, అభివృద్ధి నిరోధకులకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. కేసీఆర్ మాకు ఒక బలం.. ఒక అండ. ఆయనే మాకు ధైర్యం. కేసీఆర్‌కు నాలాంటి అభిమానులు కరీంనగర్లో లక్షల మంది ఉన్నారు’ అని ఆయన అన్నారు.