మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదంటూ బీజేపీ సీనియర్నేత బండి సంజయ్ వేసిన పిటిషన్ పై విచారణను వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది. జులై 10న విచారణ సందర్భంగా బండి కోర్టుకు వచ్చారు.
కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయస్థానం విచారణను ఈ నెల 27కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. తీర్పు అనంతరం బండి సంజయ్ ని లాయర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. బీఆర్ఎస్ మంత్రి అక్రమాలు కోర్టు తీర్పుతో బయటపడతాయని బండి అన్నారు.