సీఎం జగన్‌పై హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

సీఎం జగన్‌పై హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

వరంగల్ జిల్లా..నర్సంపేట బహిరంగ సభలో మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చుకుని రైతుల మోటార్లకు మీటర్లు పెట్టారన్నారు. విద్యుత్ సంస్కరణలను వ్యతిరేకించినందునే కేసీఆర్ కేంద్రానికి శతృవయ్యారన్నారు. తెలంగాణ భూమికొని బోరువేసి మహారాష్ట్రలో పంటలకు నీరు తీసుకెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్రం రైతులను దోచుకోవాలని చూస్తోందన్నారు.  బీజేపీ నాయకులు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారన్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో 3 టీఎంసీ పనులు ఆపాలని  కేంద్రానికి లేఖరాసిన దుర్మార్గులు బీజేపీ నాయకులు అని ఆరోపించారు. UP ఎన్నికలు అయిపోగానే రేపో, మాపో పెట్రోల్ ధరలు పెంచేందుకు బీజేపీ నాయకులు సిద్ధమవుతున్నారన్నారు. గ్యాస్ సబ్సిడీ కూడా ఎగ్గొట్టారని విమర్శించారు. కేంద్రప్రభుత్వం పేదల ఉసురు పోసుకుంటోందన్నారు మంత్రి. భేటి బచావో.. భేటి పడవో పేరుతో ప్రచారానికి కోట్లాది రూపాయలు కేటాయించారు తప్ప ఆడబిడ్డల సంక్షేమానికి ఏం నిధులు కేటాయించారో శ్వేతపత్రం విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. 

నర్సంపేట లో  330 పడకల గల జిల్లా ఆసుపత్రిని రూ. 66కోట్ల ఖర్చుతో   ప్రారంభం  చేసుకున్నామన్నారు. ఇక  నుండి అన్ని  రకాల  వైద్య సేవలు  నర్సంపేట లో  అందుబాటులో  ఉంటాయన్నారు. పేదలకు  వైద్యం  దగ్గర  చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో 26 సబ్  సెంటర్  లను నర్సంపేట కె  మొట్టమొదట  మంజూరు చేశామన్నారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు ఒక్కో  సబ్ సెంటర్  కి  రూ. 20 లక్షల రూపాయలతో  మరో 13  ఏఎన్ఎం సబ్ సెంటర్లకు మంజూరు  చేశామన్నారు. వైద్యంలో  మన రాష్ట్రాన్ని దేశానికి మార్గదర్శకంగా చేయడమే  మన సీఎం ఆశయమన్నారు. ప్రతీ  రంగంలో మన రాష్ట్రం  దేశానికి  ఆదర్శం  అవుతోందన్నారు. ఓట్ల  కోసం  కాకుండా  మానవియంగా ఆలోచన  చేసిన  ఏకైక  ముఖ్యమంత్రి  కెసిఆర్ అన్నారు. 

ఇవి కూడా చదవండి:

తగ్గుతున్న కరోనా.. పెరుగుతున్న అవయవదానాలు

అంబర్పేట్లో వ్యక్తి హల్చల్