లీకులు చేసింది బీజేపీ వాళ్లే.. సంజయ్ దే ప్లాన్ : హరీశ్ రావు

లీకులు చేసింది బీజేపీ వాళ్లే.. సంజయ్ దే ప్లాన్ : హరీశ్ రావు

పేపర్ లీకులు చేసినవాళ్లంతా బీజేపీవాళ్లే.. బండి సంజయ్ దే ప్లాన్ అని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. కేసీఆర్ ముందు బీజేపీ పప్పులుడకయ్.. హనుమంతుడి ముందు కుప్పిగంతులొద్దని హితవు పలికారు హరీశ్ రావు. ఏప్రిల్ 5వ తేదీ బుధవారం మెదక్ లో పర్యటించిన మంత్రి హరీశ్ రావు  మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక బీజేపీ పసి పిల్లలతో క్షుద్ర రాజకీయం చేస్తోందన్నారు. నిన్న బండి సంజయ్ కుట్ర నగ్నంగా బయట పడిందని..బీజేపీ ఇంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తుందా అని దేశ రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు హరీశ్ రావు. తాండూరులో పదవ తరగతి పేపర్ లీకేజీకి పాల్పడ్డ టీచర్ బీజేపీ ఉపాధ్యాయ సంఘంలో ఉన్నారు. నిన్న అరెస్టయిన ప్రశాంత్ బీజేపీలో ఉన్నారని,.ప్రశాంత్ కు బీజేపీ అగ్రనేతలతో  సంబంధాలు ఉన్నాయి హరీశ్ రావు ధ్వజమెత్తారు.

బండి సంజయ్ రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోయినా బుకాయిస్తున్నారని హరీశ్ రావు వెల్లడించారు. భవిష్యత్ తరాలకు బీజేపీ ఏం సందేశం ఇవ్వదలుచుకుందని నిలదీశారాయన. రాష్ట్రంలోని విద్యార్థులు బీజేపీ కుట్రలను గమనించాలని సూచించారు. బీజేపీకి చదువు విలువ తెలియదు..బీజేపీలో చదుకున్నోళ్లు తక్కువ ఉన్నారని ఎద్దేవ చేశారు. పేపర్ లీకేజీలో బండి సంజయ్ ప్రధాన కుట్రదారుడని ఆరోపించారు హరీశ్ రావు. ఏప్రిల్ 4వ తేదీ మంగళవారం మధ్యాహ్నం పదవ తరగతి పేపర్ లీకేజీ జరిగిందని బీజేపీ ధర్నా చేసింది.. సాయంత్రం నిందితులను విడుదల చేయాలని మళ్లీ ధర్నా చేసింది..దీంతో బీజేపీకి ఈ ఘటనతో సంబంధం ఉందని తేలిపోయిందన్నారు హరీశ్ రావు. ఈ వ్యవహారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బండి సంజయ్ ని సమర్ధించడం సిగ్గు చేటని మండిపడ్డారు.

ghmc ఎన్నికలప్పుడు, tspsc లీకేజీలో, ఎమ్మెల్యేల కొనుగోలులో బీజేపీ కుట్రలు రెడ్ హ్యాండెడ్ గా బయట పడ్డాయని వ్యాఖ్యానించారు హరీశ్ రావు. బండి సంజయ్ కు కొన్ని సూటి ప్రశ్నలు వేయదలుచుకున్నా..పదవ తరగతి ప్రశ్నా పత్రం వాట్సాప్ లో ప్రచారం చేసిన ప్రశాంత్ బీజేపీ కార్యకర్త కాదా...ప్రశాంత్ ప్రశ్న పత్రాన్ని నీకు వాట్సాప్ లో పంపింది నిజమా  కాదా..రెండు గంటల్లో 142 సార్లు నీతో నిందితుడు ఫోన్లో మాట్లాడలేదా కాదా..పనిగట్టుకుని ప్రశ్నాపత్రాలను మీడియా గ్రూపులకు, వెబ్సైట్ లకు మీ ప్రోద్భలంతో పంపింది నిజం కాదా అని ప్రశ్నించారు హరీశ్ రావు.
..ప్రశ్న పత్రం వ్యాప్తిలో నీ ప్రమేయం లేకుంటే నీకు నిందితుడు ఇచ్చిన సమాచారాన్ని ఎందుకు దాచావని బండి సంజయ్ నిలదీశారు హరీశ్ రావు. ప్రతి చిన్న ఘటనకు కేసీఆర్ కు ఆపాదించే నువ్వు సమాజంలో తలవంచుకునే చర్యకు పాల్పడ్డందుకు ఏం చేయాలని హరీశ్ అడిగారు.

రాష్ట్రాన్ని నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావ్ అని బండి సంజయ్ నిలదీశారు మంత్రి హరీశ్ రావు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లాగా మీ గుండా గిరి తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని హెచ్చరించారు.బీజేపీకి బండి చేతిలోనే మూడినట్టుందని ఎద్దేవ చేశారు..మీకు ఫేక్ డిగ్రీలు కామన్ కావచ్చు.. కానీ ఎంతో మంది కష్టపడి చదివే విద్యార్థుల జీవితాలతో చేలాగాటమాడవద్దని తెలిపారు హరీశ్. బీజేపీ విష ప్రచారాన్ని విద్యార్థులు నమ్మొద్దని కోరారు. తెలంగాణను ఆగం చేసేందుకు బీజేపీ ఎంతకైనా తెగిస్తుంది.. దాన్ని కేసీఆర్ ఎదుర్కొంటారని స్పష్టం చేశారు. బీజేపీ కుట్రలు చేదిస్తూనే ఉంటాం.. తెలంగాణ రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం..చట్టం ఎవరికైనా ఒక్కటే అన్నారు హరీశ్ రావు. బండి సంజయ్ పై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ను కోరుతున్నామని అన్నారాయన.