హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రం బరాబర్ కేసీఆర్ జాగీరేనని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సోమవారం మినిస్టర్స్ క్వార్టర్స్లో మీడియాతో ఆయన మాట్లాడారు. బీజేపీకి కాంగ్రెస్ పార్టీనే బీ టీమ్ అని, మోదీని రాహుల్ గాంధే పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. నల్గొండలో ఫ్లోరోసిస్ను కాంగ్రెస్ పెంచి పోషిస్తే తమ ప్రభుత్వమే దూరం చేసిందని గుర్తుచేశారు.
రాహుల్ ఏ హోదాలో వృద్ధులకు రూ.4 వేల పింఛన్ ప్రకటించారో చెప్పాలని డిమాండ్ చేశారు. చత్తీస్గఢ్లో వృద్ధులకు రూ.350, రాజస్థాన్లో రూ.750 పింఛన్ మాత్రమే ఇస్తున్నారన్నారు. సచ్చిపోతుందనుకున్న కాంగ్రెస్కు కర్నాటక జీవం పోసిందని, అంతకన్నా ఆ పార్టీకి ఇతర రాష్ట్రాల్లో అవకాశమే లేదని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ లీడర్ కాదని.. రీడర్గానే చూడాలన్నారు. గల్లీ నాయకులు రాసిచ్చిన స్క్రిప్ట్ను రాహుల్ చదివి వెళ్లిపోయారని జగదీశ్ రెడ్డి విమర్శించారు.