తెలంగాణ బరాబర్ కేసీఆర్ జాగీరే: మంత్రి జగదీశ్ ​రెడ్డి

తెలంగాణ బరాబర్ కేసీఆర్ జాగీరే: మంత్రి జగదీశ్ ​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రం బరాబర్ కేసీఆర్ జాగీరేనని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సోమవారం మినిస్టర్స్ క్వార్టర్స్‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. బీజేపీకి కాంగ్రెస్ పార్టీనే బీ టీమ్ అని, మోదీని రాహుల్ గాంధే పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. నల్గొండలో ఫ్లోరోసిస్‌‌ను కాంగ్రెస్​ పెంచి పోషిస్తే తమ ప్రభుత్వమే దూరం చేసిందని గుర్తుచేశారు.

 రాహుల్ ఏ హోదాలో వృద్ధులకు రూ.4 వేల పింఛన్ ప్రకటించారో చెప్పాలని డిమాండ్‌‌ చేశారు. చత్తీస్‌‌గఢ్‌‌లో వృద్ధులకు రూ.350, రాజస్థాన్‌‌లో రూ.750 పింఛన్ మాత్రమే ఇస్తున్నారన్నారు. సచ్చిపోతుందనుకున్న కాంగ్రెస్‌‌కు కర్నాటక జీవం పోసిందని, అంతకన్నా ఆ పార్టీకి ఇతర రాష్ట్రాల్లో అవకాశమే లేదని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ లీడర్ కాదని.. రీడర్‌‌‌‌గానే చూడాలన్నారు. గల్లీ నాయకులు రాసిచ్చిన స్క్రిప్ట్‌‌ను రాహుల్ చదివి వెళ్లిపోయారని జగదీశ్ రెడ్డి విమర్శించారు.