ఆధ్యకళను తిలకించిన మంత్రి జూపల్లి

ఆధ్యకళను తిలకించిన మంత్రి జూపల్లి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌ నాంపల్లిలోనితెలుగు యూనివర్సిటీలో ఆధ్యకళ మ్యూజియం ఆధ్వర్యంలో సంస్కృతి, అధ్యయన పరిరక్షణ సదస్సు నిర్వహించారు. శుక్రవారం ఈ సదస్సుకు మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఆధ్యకళ సేకరించిన 3,500 కళా ఖండాలను ఆయన ఆసక్తిగా తిలకించారు. ప్రొఫెసర్లు కోదండరాం, జయధీర్ తిరుమలరావు మంత్రికి కళల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.