కవిత చెప్పింది నిజం.. దెయ్యాలను పెంచి పోషించింది కేసీఆరే: మంత్రి జూపల్లి

కవిత చెప్పింది నిజం.. దెయ్యాలను పెంచి పోషించింది కేసీఆరే: మంత్రి జూపల్లి

కామారెడ్డి: ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. కేసీఆర్ దేవుడు.. కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయన్న కవిత కామెంట్స్‎పై ఆయన రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని.. ఆయన కూతురు కవిత చెప్పిన దాంట్లో అబద్ధం ఏమి లేదు. బీఆర్ఎస్‎లో ఆ దెయ్యాలను పెంచి పోషించింది స్వయంగా కేసీఆరేనని హాట్ జూపల్లి హాట్ కామెంట్స్ చేశారు. 

గురువారం (మే 29) కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంచార్జ్ మంత్రి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహదారు షబ్బీర్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. గత పదేళ్లు తెలంగాణను పాలించిన కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పులకు ప్రతి నెల మా ప్రభుత్వం వడ్డీ కడుతోందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బీఆర్ఎస్  ఆగం చేసిన.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మా ప్రభుత్వం పథకాలను ఆపకుండా నిరంతరంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. 

Also Read : మా పార్టీ సేఫ్గానే ఉంది.. ముందు మీ పార్టీ గురించి చూసుకోండి

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. కానీ అమెరికా మాట విని మధ్యలోనే ఆపరేషన్ సిందూర్ ఆపడం సరికాదని అన్నారు. ఇందిరాగాంధీ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపారని.. ఆమె హయాంలో పాక్‎తో యుద్ధం ఆపడానికి అమెరికా రాయబారం చేస్తే అంతర్గత విషయాల్లో జ్యోక్యం చేసుకోవద్దని అగ్రరాజ్యానికి తేల్చి చెప్పారని గుర్తు చేశారు. ఇక, తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు గెలుపు దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 70, 80 శాతం సీట్లు కైవసం చేసుకోవాలని సూచించారు.