![వరంగల్ లో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ : కొండా సురేఖ](https://static.v6velugu.com/uploads/2024/02/minister-konda-surekha-distributed-kalyan-lakshmi-sanctioned-to-many-people_gXsFHY3UO8.jpg)
గ్రేటర్ వరంగల్, వెలుగు : వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పలువురికి మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీమూబారక్ చెక్కులను బుధవారం మంత్రి కొండా సురేఖ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొత్తం 446 మందికి చెక్కులు అందజేసినట్లు చెప్పారు.
తూర్పు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు.