క్రిస్మస్ విందు: ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కొప్పుల

క్రిస్మస్ విందు: ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కొప్పుల

క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్లకు రాష్ట్ర ప్రభుత్వం విందును ఏర్పాటుచేస్తుంది. ఈనెల 20న ఎల్బీ స్టేడియంలో ఇస్తున్న విందు ఏర్పాట్లను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యవేక్షిస్తున్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన… రాష్ట్రంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని చెప్పారు. గత ఐదు సంవత్సరాలనుంచి క్రిస్మస్ వేడుకలను జరుపుతున్నామని.. సీఎం కేసీఆర్ సూచనలమేరకు.. గతంలోకంటే ఈ సారి మరింత ఘనంగా క్రిస్మన్ ను  జరుపుకునేలా ఏర్పాట్లను చేశామని తెలిపారు. విందుతో పాటు కానుకలు ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు.