అధికారిపై కొప్పుల ఫైర్..కోపంతో ఫోన్ విసిరేసిన మంత్రి

అధికారిపై కొప్పుల ఫైర్..కోపంతో ఫోన్ విసిరేసిన మంత్రి

హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంటలో దళిత బంధు సర్వే చేస్తున్న అధికారి పై మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వస్తుంటే కనీస ఏర్పాట్లు చేయవా అంటూ గుస్సా అయ్యారు. మంత్రుల కంటే ఎక్కువ బిజీ అయ్యారంటూ అధికారిపై ఒంటికాలిపై లేచారు కొప్పుల. కోపంతో ఊగిపోయిన మంత్రి తన చేతిలో ఉన్న ఫోన్ విసిరేశారు. జమ్మికుంట మున్సిపాలిటీలోని 21 వార్డులో సర్వే సమయంలో  అధికారిపై గుస్సా అయ్యారు మంత్రి కొప్పుల.