లోకేశ్ కుమార్ కు మంత్రి కేటీఆర్ అభినందనలు

లోకేశ్ కుమార్ కు మంత్రి కేటీఆర్  అభినందనలు

హైదరాబాద్, వెలుగు : జీహెచ్ఎంసీ కమిషనర్ గా పనిచేసి బదిలీపై వెళ్తున్న లోకేశ్ కుమార్ ను మంత్రి కేటీఆర్ అభినందించారు.  బుధవారం మెట్రో రైల్ భవన్ లో జరిగిన ఎంఏయూడీ వార్షిక నివేదిక సమావేశంలో ఆయనను సన్మానించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. లోకేశ్ కుమార్  ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీలో పలు కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా సిటీలో మౌలిక వసతుల్లో భాగంగా ఎస్ఆర్డీపీ, లింక్ రోడ్ల నిర్మాణం, ఎస్ఎన్డీపీ వంటి వ్యూహాత్మక కార్యక్రమాలను సక్సెస్ చేయడంలో ఆయన కృషి మరువలేనిదన్నారు.

 మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, వాటర్ బోర్డు  ఎండీ దానకిషోర్, కొత్త కమిషనర్ రొనాల్డ్ రోస్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, జోనల్ కమిషనర్లు డిప్యూటీ కమిషనర్లు ఉన్నారు.