అమిత్ షా టూర్ పై ధన్యవాదాలంటూ కేటీఆర్ సెటైర్లు

అమిత్ షా టూర్ పై ధన్యవాదాలంటూ కేటీఆర్ సెటైర్లు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో కౌంటర్ వేశారు. ఐటీఐఆర్, పాలమూరు ప్రాజెక్టుకు హోదా, మెట్రో ఫేజ్ 2, ఐఐఎం, ఐఐఊటీ నవోదయాలు, మెడికల్ కాలేజీలకు, ఎన్ఐడీలకు శంకుస్థాపనకు వచ్చిన అమిత్ షాకు ధన్యవాదాలంటూ  సెటైర్ వేశారు.  గత తొమ్మిదేళ్లుగా  తెలంగాణ ప్రభుత్వం వీటిపై ప్రశ్నిస్తోన్న ఒక్కటి కూడా ఇవ్వలేదంటూ ఇలా సెటైరికల్ గా  గుర్తు చేశారు. అంతేగాకుండా ఈ  9 ఏళ్లలో తెలంగాణ కంటే మెరుగ్గా ఉన్న..  ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రం పేరు ఎందుకు చెప్పలేదంటూ ప్రశ్నించారు కేటీఆర్.

 

https://twitter.com/KTRBRS/status/1650139851302510592

అంతకు ముందు చేవెళ్ల సభలో మాట్లాడిన అమిత్ షా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు నిద్రపోమంటూ వ్యాఖ్యానించారు.  సీఎం కేసీఆర్ ఏం చేసినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తోందన్నారు. ప్రజలు తమ వైపే ఉన్నారని చెప్పారు.   వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు ఈ సభ నిదర్శనమని చెప్పారు. రాష్ట్రంలో అవినీతి సర్కార్ నడుస్తోందని  ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ పనితీరును దేశం  మొత్తం చూస్తోందని చెప్పారు. 

వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీజేపీనే గెలుస్తుందని, దేశానికి  ప్రధానిగా మోడీనే బాధ్యతలు చేపడుతారని తెలిపారు.  కేసీఆర్ ముందు తన సీఎం సీటు కాపాడుకుంటే చాలని చెప్పారు.  బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్‌ దేశమంతా విస్తరించాలనుకుంటున్నారని, అందులో భాగంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.