రూ.168 కోట్లతో మూసి నది, ఈసా నదులపై ఐదు బ్రిడ్జిలు

రూ.168 కోట్లతో మూసి నది, ఈసా నదులపై ఐదు బ్రిడ్జిలు

 హైదరాబాద్ నగరానికి మధ్యలో ఉన్న మూసి నది, ఈసా నదిలపై ఐదు వంతెనల బ్రిడ్జిల నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఉప్పల్ భగాయత్ శిల్పారామం సమీపంలోని మూసి పరివాహక ప్రాంతంలో భూమి పూజ  చేశారు.  

రూ.168కోట్ల వ్యయంతో హెచ్ఎండిఏ ఈ  ఐదు బ్రిడ్జిలను నిర్మించనున్నది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా మెరుగుపరచాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మూసి ఈసా నదులపై పలు వంతెనలను ప్రతిపాదించింది.  మూసి, ఈసా నదులపై 14 బ్రిడ్జిలు నిర్మించనున్నారు. అందులో  హెచ్ఎండిఏ  ఆధ్వర్యంలో మూసినదిపైన మూడు  చోట్ల, ఈసానదిపై రెండు  చోట్ల వంతెనల నిర్మాణ పనులను చేపడుతుంది.                  

Also Read :- బిఆరెస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్లోకి కుంభం అనిల్ కుమార్ రెడ్డి

                                           

రూ.168 కోట్ల వ్యయంతో  నిర్మించే ఐదు వంతెనలు ఇవే

  • రూ.42కోట్లతో ఉప్పల్ బాగాయత్ లే అవుట్ దగ్గర  
  • రూ.35కోట్లతో ప్రతాపసింగారం- గౌరెల్లి దగ్గర
  • రూ.39కోట్లతో మంచిరేవుల దగ్గర
  • రూ.32కోట్లతో బుద్వేల్ ఐటీ పార్క్-2 సమీపంలో ఈసా నదిపై
  • రూ.20కోట్లతో బుద్వేల్ ఐటీ పార్క్-1 సమీపంలో ఈసా నదిపై హెచ్ఎండిఏ వంతెనలు నిర్మించనుంది
  • ఉప్పల్ భగాయత్, ప్రతాపసింగారం ప్రాంతాల్లో సుమారు 210 మీటర్ల పొడవున నాలుగు వరుసల వంతెన నిర్మాణం జరుగనుంది.