ఇయ్యాల స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్.. ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

ఇయ్యాల స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్.. ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
  • ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి, అధికారులు

ముషీరాబాద్, వెలుగు: ఆర్టీసీ చౌరస్తాలో ట్రాఫిక్​కు చెక్ పెట్టేందుకు ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు రూ. 452 కోట్లతో నిర్మించిన స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. శనివారం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బల్దియా కమిషనర్ రోనాల్డ్ రోస్, స్థానిక ఎమ్మెల్యే ముఠాగోపాల్ అధికారులతో కలిసి స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. 

అనంతరం మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రజల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు మంత్రి కేటీఆర్ చొరవతో ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు 2.62 కిలోమీటర్ల మేర స్టీల్ బ్రిడ్జిని నిర్మించినట్టు తెలిపారు. ప్రజలు సౌకర్యవంతంగా ప్రయాణించేలా ప్రభుత్వం రోడ్డు కనెక్టివిటీకి కృషి చేస్తుందని పేర్కొన్నారు.  ఎంఎన్ శ్రీనివాస్ రావు, శ్రీనివాస్ రెడ్డి, ముఠా జయసింహ, ముచ్చకుర్తి ప్రభాకర్ తోపాటు అధికారులు ఉన్నారు.