ఇవాళ హన్మకొండలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్

 ఇవాళ హన్మకొండలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్

ఇవాళ హన్మకొండ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. వేలేరు మండలంలో రూ.133కోట్లతో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్ట్ తోపాటు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్స వాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సోడషపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ పాల్గోననున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు,ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజయ్యలు పాల్గొననున్నారు. మరోవైపు పీజీ మెడికల్​ స్టూడెంట్ ప్రీతి అంత్యక్రియల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మంత్రి కేటీఆర్ పర్యటను పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.