కులగణనతోనే పంచాయతీ ఎన్నికలు ఆలస్యం : మంత్రి పొన్నం ప్రభాకర్

కులగణనతోనే పంచాయతీ ఎన్నికలు ఆలస్యం : మంత్రి పొన్నం ప్రభాకర్

నర్సంపేట, వెలుగు: కుల గణన చట్టం చేసి గవర్నర్​ ఆమోదం తెలిపిన తర్వాత కేంద్రానికి పంపించామని..  అందువల్లే స్థానిక సంస్థల ఎన్నికలు కొంత ఆలస్యం అవుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్​ పేర్కొన్నారు. వరంగల్​ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో మంగళవారం ఓ ప్రైవేట్​ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలపై కొంత మంది కావాలని అపోహలు సృష్టిస్తున్నారని చెప్పారు. 

కాంగ్రెస్  సర్కార్​ 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తోందని, ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు. వంద శాతం రిజర్వేషన్లు​ కల్పించడమే కాంగ్రెస్​ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. అనంతరం తాటి వనంలో గీత కార్మికులతో మాట్లాడారు. గీత కార్మికులు ఇచ్చిన ముంజల రుచి చూశారు.