త్వరలోనే ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు.. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన

త్వరలోనే ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు.. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన

త్వరలోనే ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీలో ఉద్యోగుల పీఆర్సీపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. 2017 ,2021 పీఆర్సీ పెండింగ్ బిల్స్ కి సంబంధించిన దానిపై చర్చిస్తున్నామని అన్నారు. ఆర్టీసీ ఉత్తమ ఉద్యోగులకు అవార్డులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థ రాష్ట్రానికి పునాది అని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు మేడారం జాతర కోసం చాలా కష్టపడ్డారని తెలిపారు. ఆర్టీసీ ఆపరేషన్ లాస్ నుండి లాభాల్లోకి రావడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. పెండింగ్ బిల్స్ పై త్వరలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.  ఎలక్షన్స్ కోడ్, కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మహాలక్ష్మి స్కీమ్, వర్క్ లోడ్ కారణంగా ఆర్టీసీ బకాయిల పై నిర్ణయాలు ఆలస్యమౌతున్నాయని చెప్పారు. 

ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు మహాలక్షి పథకం పేరు మీద అవార్డ్స్ ఇవ్వాలని నిర్ణయించామని పొన్నం తెలిపారు. ఇప్పటికే సీఎం ఆర్టీసీ కార్మికులకు రూ. 280 కోట్ల బాండ్స్ ప్రకటించారని అవి కూడా రెండు మూడు రోజుల్లో పేమెంట్స్ రిలీజ్ చేస్తామని చెప్పారాయన.  మహాలక్ష్మి పథకంతో నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల బాట పట్టిందని ఆర్టీసీ మహాలక్ష్మి స్కీమ్ తో కళకళలాడుతోందని తెలిపారు.