మిర్చి నాణ్యత పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ

మిర్చి నాణ్యత పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ

ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన మిర్చి నాణ్యత పరీక్షా కేంద్రాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో 45 లక్షల విలువ గల యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ యంత్రాల ద్వారా మిర్చి నాణ్యతను పరీక్షించవచ్చని మంత్రి పువ్వాడ అన్నారు. మిర్చి పొడవు, రంగు, తాలు శాతం, తొడిమెల శాతం, గింజల శాతం, వేస్టేజీ ఎంత అనే విషయాలను తెలుసుకోవచ్చని చెప్పారు. దీంతో రైతులు మోసపోకుండా మంచి గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు.

కాగా, రాష్ట్రంలో మిర్చి బంగారమైంది. గోల్డ్ రేట్లను వెనక్కి నెడుతూ రికార్డ్ స్థాయిలో ధర పలుకుతోంది. ఒకప్పుడు 10 వేలు దాటితే గొప్ప అనుకున్న.. రైతన్నకు ఎర్రబంగారం కాసులు కురిపిస్తోంది. ఇవాళ ఏకంగా దేశీయ మిర్చి ధర తులం బంగారం ధరను దాటింది. వరంగల్ ఏనుమముల వ్యవసాయ మార్కెట్ లో రికార్డు స్థాయిలో మిర్చి ధర పలికింది. దేశీయ మిర్చి ధర క్వింటాల్ 55 వేల 551 రూపాయిలు పలికింది. మార్కెట్ చరిత్రలో ఇదే అత్యధిక ధర అని అధికారులు చెబుతున్నారు. మరో వైపు పత్తి కూడ రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది. క్వింటాల్ పత్తి ధర 12 వేల 110 పలికింది. ఇది కూడా అత్యధిక ధర అని అధికారులు అంటున్నారు. మిర్చి ధర రోజు రోజుకు పెరుగుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం..

నీలోఫర్‌‌లో మూడ్రోజుల పసికందును వదిలేసిన్రు

వడ్లు కొనకుంటే బీజేపీకి నూకలు చెల్లినట్టే

హెచ్డీఎఫ్సీ బ్యాంకులో విలీనం కానున్న హెచ్డీఎఫ్సీ