తెలంగాణ ప్రభుత్వం వరద బాధితులకు ఇచ్చే నష్టపరిహారాన్ని నిజమైన లబ్ధిదారులకు కాకుండా TRS జెండా మోసే గాడిదలకు ఇస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. వరదల పేరుతో TRS నేతలు దోపిడి చేస్తున్నారని, లబ్ధిదారులకు రూ. 10 వేలు ఇవ్వాల్సింది పోయి.. రెండు మూడు వేలు ఇచ్చి మిగతా డబ్బులు జేబులో వేసుకుంటున్నారని అన్నారు.
వరద సహాయం చేస్తలేదని ప్రజలు ఆందోళన చేస్తున్నారని, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను నగర ప్రజలు నిలదీశారన్నారు. బస్తీ లల్లో కొంత మందికి ఇచ్చి కొంత మందికి ఇవ్వలేదన్నారు.లబ్ధిదారులకకు వరద సహాయాన్ని నేరుగా కాకుండా బ్యాంక్ అకౌంట్ లో ఎందుకు వేయడం లేదని రేవంత్ ప్రశ్నించారు. TRS నేతలు దోపిడి చేసుకోవడానికే వారి చేతికి డబ్బులు ఇస్తున్నారన్నారు
అధికారులు కూడా ఈ విషయంపై ఇష్టారాజ్యంగా వ్యవరిస్తున్నారని, కొంత మంది అధికారులు అసలు అందుబాటులో ఉండడం లేదని అన్నారు. ఈ విషయాలన్నీ అడుగుదామని జోనల్ కమిషనర్ వద్దకు వచ్చి చెప్తే ఆయనకు సమాచారం లేదంటున్నాడని రేవంత్ మండిపడ్డారు.సోమవారం నాటికి నిజమైన లబ్దిదారులకు అందరికీ పదివేల రూపాయలు అందించకపోతే జోనల్ కమిషనర్ కార్యాలయంను ముట్టడి చేస్తామని రేవంత్ హెచ్చరించారు.