పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ప్రభుత్వ విధానాలు, సీఎం జగన్, మంత్రలు, వైసీపీ నేతలను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. హలో ఏపీ.. బైబై వైసీపీ ఇదే మన నినాదం అన్న పవన్ కు వైసీపీ నేతలు కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. వైసీపీ మంత్రి రోజా పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబు పై కూడా ఫైరయ్యారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు హాయ్ ఏపీ.. బైబై బీపీ ( బాబు, పవన్ కళ్యాణ్) అనే నినాదాన్ని అందుకుంటారని తెలిపారామె. జిల్లా అధ్యక్షులు , 175 స్థానాల్లో అభ్యర్థులు లేని జనసేన పార్టీ జగన్ ను తరిమేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు.
14 ఏళ్లు సీఎం గా ఉన్న చంద్రబాబుకు బుర్ర పెట్టి ఆలోచించే సత్తా లేక.. తన మేనిఫెస్టోను పక్కన పెట్టాడని విమర్శించారు మంత్రి రోజా. టీడీపీని ప్రజలు నమ్మే స్థితిలో లేరంటూ... చెప్పిన మాటను నెరవేర్చిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ ఒక్కడేనన్నారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి ఆమె తిరుపతిలో మాట్లాడుతూ..ఒకరోజు సీఎం అవుతానని.. మరో రోజు ఎమ్మెల్యే కావాలని అంటాడని.. ఇంకోరోజు ఇప్పుడు గెలవలేనని చెబుతాడని రోజా సెటైర్లు వేశారు. వైసీపీ నేతలను కొడతానని చెప్పడానికే పార్టీ పెట్టాడా అని ప్రశ్నించారు. తనకు ఓట్లు వేసే వారే మీటింగ్ లు రావాలని పవన్ చెబుతున్నాడని.. ప్రజలకు ఏమి చేస్తాడో స్పష్టంగా చెప్పలేని పవన్ కు ఎందుకు ఓట్లేయాలి అని మంత్రి ఆర్కే రోజా నిలదీశారు. మీరు కలిసి వచ్చినా, విడివిడిగా వచ్చినా తనకు భయం లేదన్న రోజా.. . తనకు ఆరోగ్య సమస్య వస్తే జనసేన సైకోలు అనవసరంగా కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు.