కేటీఆర్ టైం ఇవ్వు.. ఏపీ మొత్తం చూపిస్తా..

కేటీఆర్ టైం ఇవ్వు.. ఏపీ మొత్తం చూపిస్తా..

మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి రోజా స్పందించారు. మంత్రి కేటీఆర్ ను ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లి అక్కడ జరిగిన అభివృద్ధిని చూపిస్తానని చెప్పారు. కేటీఆర్ చేసిన కామెంట్స్ వాట్సాప్ లో చూశానన్న రోజా.. అందులో ఏపీ గురించి ప్రత్యేకంగా మాట్లాడారని అనుకోవడం లేదన్నారు. ఆయన మిగతా రాష్ట్రాల గురించి వ్యాఖ్యానించినట్టు అర్థమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన డెవలప్ ను చూడాలనుకుంటే.. కేటీఆర్ ఆయన ఫ్రెండ్ వస్తే రాష్ట్రం మొత్తం తిప్పి చూపిస్తానని చెప్పారు. రాష్ట్రంలో అవినీతికి తావులేకుండా పాలన సాగుతోందని, సంక్షేమ పథకాల అమలులో తమిళనాడు ఏపీని ఆదర్శంగా తీసుకుందని రోజా చెప్పారు. కులమతాలకు అతీతంగా అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని చెప్పారు. కరెంట్ సమస్య అన్ని రాష్ట్రాల్లో ఉందని అన్నారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగానే కలిశానని రోజా చెప్పారు. మంత్రి అయిన తర్వాత తొలిసారి హైదరాబాద్ కు వచ్చిన తనను కుటుంబ సభ్యులతో కలిసి  ప్రగతిభవన్ కు రావాలని సీఎం కేసీఆర్ ఆహ్వానించారని అన్నారు. అందుకే కుటుంబంతో కలిసి ముఖ్యమంత్రిని కలిసినట్లు చెప్పారు.

మరిన్ని వార్తల కోసం

మండుటెండలో వినూత్నంగా పెళ్లి బరాత్

పెళ్లిలో నాగిన్ డాన్స్ కోసం నిజమైన కోబ్రా