కుల, మతాలకు అతీతంగా గణేశ్ పండుగను జరుపుకోండి

కుల, మతాలకు అతీతంగా  గణేశ్ పండుగను జరుపుకోండి

హైదరాబాద్: రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని బాలాపూర్ గణపతిని కోరుకున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం బాలాపూరు వినాయకున్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... ఖైరతాబాద్ వినాయకుడికి ఎంత విశిష్టత ఉందో... బాలాపూర్ వినాయకుడికి అంతే విశిష్టత ఉందన్నారు. బాలాపూర్ వినాయకుడు తన నియోజకవర్గంలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. కుల మతాలకు అతీతంగా వినాయక చవితి పండుగను జరుపుకోవాలని సూచించారు. మంత్రి వెంట కార్పొరేటర్లు, బాలాపూర్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.