రాష్ట్రంలో అభివృద్ధిని అందరూ గమనించాలి: సబితా

రాష్ట్రంలో అభివృద్ధిని అందరూ గమనించాలి: సబితా

తెలంగాణ రాష్ట్రం వచ్చాక అభివృద్ధి, సంక్షేమం ఏ విధంగా జరుగుతుందో ప్రతి ఒక్కరూ గమనించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. ప్రజలకు ఏది అవసరమో అలాంటి పనులే చేయాలని సీఎం కేసీఆర్ సూచించారని అన్నారు. మహేశ్వరం మండలంలోని వుప్పుగడ్డతండ, మహేశ్వరం గ్రామాల్లో.. రూ. 7 కోట్ల 72లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం జరిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ అనితా రెడ్డిలు పాల్గొన్నారు. అక్కడి ప్రజలతో మాట్లాడి.. ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వారికి వివరించారు. 

కేసీఆర్ సూచన మేరకు ప్రజలకు అవసరమైన అన్ని పనులను పూర్తి చేస్తున్నామని మంత్రి చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆమె తెలిపారు. ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా దళిత బంధు పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి.. 10 లక్షల రూపాయలు అందిచడం జరుగుతుందని మంత్రి సబిత పేర్కొన్నారు.