
ములుగు, వెలుగు : అర్హులైన ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి సీతక్క చెప్పారు. ములుగు జిల్లా కేంద్రంలోని తోకుంట రోడ్డులో తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన జిమ్ను సోమవారం ప్రారంభించారు. అనంతరం జంగన్నపేట రోడ్డులో ఏర్పాటు చేసిన పెట్రోల్బంక్ను ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పదేండ్లు పాలన సాగించిన బీఆర్ఎస్ వెయ్యి ఇండ్లు కట్టించలేదని, ఇచ్చిన ఇండ్లు సైతం అసంపూర్తిగా ఉన్నాయని విమర్శించారు.
అర్హులైన వారిని గుర్తించి దశలవారీగా అందరికీ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ములుగు కలెక్టర్ దివాకర టీఎస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ ఉన్నారు. అనంతరం క్యాంప్ ఆఫీస్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.