సికింద్రాబాద్,వెలుగు :75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సామాజిక తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏడాదిపాటు నిర్వహించనున్న కార్యక్రమాల పోస్టర్ ను సెక్రటేరియట్ లో మంత్రి సీతక్క బుధవారం ఆవిష్కరించారు. రాజ్యాంగ విలువలు ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అసోసియేషన్అధ్యక్షుడు తాళ్ల అజయ్చెప్పారు.
ఇందులో భాగంగా మాక్ ఓటింగ్, మాక్ అసెంబ్లీ, రాజ్యంగ పీఠిక పఠనం, పుస్తకాల పంపిణీ లాంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సామాజిక న్యాయం అందే విధంగా పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఆయనవెంట విద్యార్థి నేతలు లింగంపల్లి మనోజ్, గుగ్గిళ్ల మధు, అజ్జమారి ప్రసాద్ ఉన్నారు.