దేశ ప్రజలు మోదీ నుండి విముక్తి కోరుకుంటున్నారు: సీతక్క

దేశ ప్రజలు మోదీ నుండి విముక్తి కోరుకుంటున్నారు: సీతక్క

దేశ ప్రజలు మోదీ నుండి విముక్తి కోరుకుంటున్నారన్నారు మంత్రి సీతక్క. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ములుగులో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ అధ్యక్షతన జరిగిన ములుగు నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ తోపాటు సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన దాదాపు200 మంది బీఆర్ఎస్ కార్యకర్తలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆమె.

అనంతరం ఆమె మాట్లాడుతూ..  దేశంలో కాంగ్రెస్ రాబోతుందని.. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కాబోతున్నారన్నారు.  హిందువుల పార్టీ అని చెప్పుకునే బీజేపీ.. అగరబత్తిపై కూడా జీఎస్టీ వేసిందని విమర్శించారు. గ్యారెంటీలకే గ్యారెంటీ రాహుల్ గాంధీ అని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయడం లేదనే బీఆర్ఎస్‌ను ప్రజలు పక్కన పెట్టారని చెప్పారు.  జీఎస్టీ తీసుకువచ్చి.. రూ.54 లక్షల కోట్లను పేదల నుంచి దోచుకున్నారని విమర్శించారు. - మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్  భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.