మోదీ పాలనలో దేశాభివృద్ధి శూన్యం: సీతక్క

మోదీ పాలనలో దేశాభివృద్ధి శూన్యం: సీతక్క

మోదీ పాలనలో దేశానికి ఒరిగిందేమీ లేదన్నారు మంత్రి సీతక్క. బీజేపీ పాలనలో అక్షింతలు, రామమందిరం, పూల్వామా దాడి ఘటనలు తప్పా.. అభివృద్ధి శూన్యమని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తల్లీబిడ్దల పాలనను అందిస్తుందన్నారు మంత్రి సీతక్క. మహిళ సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ ప్రాధాన్యత ఇస్తుందని.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని తెలిపారు.

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని,  కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు సైనికుల్లా పని చేయాలని వెల్లడించారు. నిర్మల్ జిల్లా భైంసాలో ముధోల్ అసెంబ్లీ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. ముఖ్య నేతలు, కార్యకర్తలతో వరుస మీటింగులు నిర్వహిస్తున్నారు. 

దేశంలో కాంగ్రెస్ తోనే నిజమైన అభివృద్ధి జరుగుతుందని చెప్పారు సీతక్క. బీజేపీ పాలనలో  కార్పొరేట్ సంస్థలకు తప్పా.. పేదలకు సంక్షేమం జీరో అని మండిపడ్డారు.