నవంబర్ కల్లా ఇందిరా మహిళా శక్తి భవనాలు పూర్తి చేయాలి  :  మంత్రి సీతక్క

నవంబర్ కల్లా ఇందిరా మహిళా శక్తి భవనాలు పూర్తి చేయాలి  :  మంత్రి సీతక్క

ములుగు, వెలుగు : నవంబర్ కల్లా ములుగు జిల్లాలో చేపట్టిన నూతన ఇందిరా మహిళా శక్తి భవనాలు పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క సూచించారు. సోమవారం మంత్రి సీతక్క, ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలిసి బడిబాట, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలపై  జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ మహిళా శక్తి భవనాల నిర్మాణంలో పురోగతి ఆశాజనకంగా లేదన్నారు. ఈనెల 12 నుంచి స్కూల్​ రీ ఓపెన్​ జరుగుతున్న నేపథ్యంలో యూనిఫాం, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని ఆదేశించారు.

అంగన్వాడీలను బలోపేతం చేయాలని, పండుగ వాతావరణంలో ప్రారంభించాలన్నారు. పెట్రోల్​ పంపుల ఏర్పాటుకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలన్నారు. ప్రతి జిల్లాలో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం సబ్ స్టేషన్ పరిధిలో 8ఎకరాల అనువైన భూమి 10 రోజుల్లో గుర్తించాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్​లో ములుగు కలెక్టర్​ దివాకర మాట్లాడుతూ నవంబర్ నాటికి ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.