మేడారంలో మంత్రి సీతక్క పూజలు

మేడారంలో మంత్రి సీతక్క పూజలు

తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం వనదేవతలను గురువారం పంచాయతీరాజ్​శాఖ మంత్రి సీతక్క దర్శించుకున్నారు. అమ్మవార్లకు పసుపు, కుంకుమ, పూలు, చీరె సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు మేండారంతో రూ.కోటీ 98 లక్షలతో నిర్మించిన పూజారుల అతిథి గృహాన్ని మంత్రి అడిషనల్​ కలెక్టర్​ మహేందర్​ జీతో కలిసి ప్రారంభించారు. అనంతరం తాడ్వాయి మండల కేంద్రంలోని ఆర్టీసీ  బస్టాండ్ ఆవరణలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ రియాజ్ తో కలిసి ఆవిష్కరించారు.

అనంతరం విగ్రహం ప్రతిష్ఠాపన అధ్యక్ష, కార్యదర్శులు బండారు చంద్రయ్య, వావిలాల రాంబాబు ఆధ్వర్యంలో తాడ్వాయి మాజీ సర్పంచ్ ఇర్ఫా సునీల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీటింగ్​లో మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం గర్వంగా ఉందన్నారు. కార్యక్రమంలో ములుగు జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్, తహసీల్దార్ సురేశ్​ బాబు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్,  కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు రేగ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్ట్ కుటుంబానికి చేయూత..

ములుగు : అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన ములుగు జిల్లా ఓ పత్రిక ప్రతినిధి భూక్య సునీల్ కుమార్ కుటుంబానికి తోటి జర్నలిస్టులు అండగా నిలిచారు. రూ.1.35 లక్షలను పోగుచేసి కుటుంబ సభ్యులకు అందజేశారు. గురువారం ములుగు మండలం కోడిసెలకుంటలో సునీల్ కుటుంబ సభ్యులను పరామర్శించి కలిసి రూ.30 వేల నగదు అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని, పిల్లల చదువుకు ఇబ్బంది కలగకుండా సహకరిస్తామని హామీ ఇచ్చారు.