ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు సీఎం చర్యలు

ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు సీఎం చర్యలు

ఆర్టీసీ సమ్మెపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు సీఎం చర్యలు చేపట్టారని అన్నారు. ప్రభుత్వంతో ఆర్టీసీ కార్మికులు గ్యాప్ పెంచుకోవద్దని సూచించారు. ఖాళీగా ఉన్న ఆర్టీసీ బస్సులను ఆదాయం కోసమే లీజుకిస్తారని అన్నారు. ఓపెన్ బిడ్డింగ్ లో  కేటాయిస్తే టీఆర్ఎస్ నేతలకు లింక్ పెట్టడం సరికాదన్నారు. ఆర్టీసీ ఆస్తుల విషయం ఇప్పుడే గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. విలీనానికి చట్టపరమైన చిక్కులున్నాయని చెప్పారు. విలీన విషయాన్నిఅధ్యయనం చేయాల్సి ఉంటుందన్నారు. విలీనం ఇప్పుడే చేయాలనేలా కొన్ని రాజకీయ పార్టీలు రెచ్చగొడుతున్నాయని అన్నారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు.