గ్రామ కార్యదర్శుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా

గ్రామ కార్యదర్శుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా

వరంగల్ అర్బన్ జిల్లా : తెలంగాణ వచ్చాక పల్లెలకు పూర్వ వైభవం వస్తుందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. శుక్రవారం వరంగల్ అర్బన్ జిల్లాలో పర్యటించారు మంత్రి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టే పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. పంచాయతీ కార్యదర్శుల డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గ్రామ కార్యదర్శుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.