ఈడీ విచారణకు హాజరైన తలసాని పీఏ

ఈడీ విచారణకు హాజరైన తలసాని పీఏ

చీకోటి ప్రవీణ్‌ క్యాసినో కేసులో మంత్రి తలసాని పర్సనల్ సెక్రటరీ అశోక్ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈడీ కార్యాలాయంలో విచారణకు హాజరైన అశోక్ ను.. క్యాసినో కు సంబంధించిన వివరాలపై ఈడీ అధికారులు ప్రశ్నించారు. క్యాసినో కేసులో ఇప్పటికే తలసాని బ్రదర్స్ మహేష్ యాదవ్, ధర్మేంధర్ యాదవ్‌ లను ఈడీ విచారించింది. 

క్యాసినో దందాలో మనీలాండరింగ్ పై అశోక్ ఈడీ సుదీర్ఘంగా ఈడీ అధికారులు విచారించారు. కాగా ఈ కేసులో ఇప్పటికే చీకోటి ప్రవీణ్ ను ఈడీ పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. ప్రవీణ్ ఇంట్లో, కార్యాలయాల్లో కూడా ఈడీ సోదాలు చేసింది.