రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా.. ప్రతిపక్షాల నాయకులకు కనిపించడం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. TSPSC నుండి పేపర్ లీకేజీపై BJP, కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని కొట్టిపారేశారు. అన్ని మతాలను తెలంగాణ ప్రభుత్వం సమానంగా గౌరవిస్తోందని చెప్పారు. కొన్ని పార్టీలు మతాలతో రాజకీయాలు చేస్తూ.. ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు.
తెలంగాణ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత BRS పార్టీదని మంత్రి తలసాని అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలోని మోండా మార్కెట్ డివిజన్ లో నిర్వహించిన BRS ఆత్మీయ సమావేశంలో తలసాని పాల్గొన్నారు. ప్రజల కోసం KCR నాయకత్వంలో పుట్టిన పార్టీ BRS అని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంతో పేదల సొంత ఇంటి కల నెరవేర్చిన ఘనత KCR కే దక్కుతుందన్నారు.