70 ఏళ్లలో జరగని అభివృద్ధి 7 ఏళ్లలో జరిగింది

70 ఏళ్లలో జరగని అభివృద్ధి 7 ఏళ్లలో జరిగింది

రాష్ట్రంలో 70 ఏళ్లలో జరగని అభివృద్ధి 7 ఏళ్లలో జరిగిందన్నారు మంత్రి శ్రీనివాస్ యాదవ్. ఇంటింటికి నల్లనీళ్లు, లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందిస్తున్న ఘనత సీఎం KCRదేనని చెప్పారు. రాష్ట్రంలో రైతుబంధు, కళ్యాణలక్ష్మి వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. KCR బడుగు బలహీనవర్గాలకు పదవులు ఇచ్చి, రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారన్నారు తలసాని. హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రజల మధ్య ఉండే నాయకుడని చెప్పారు.