టైలరింగ్ వృత్తి చేసుకునే యువతకు క్రికెట్ లీగ్: మంత్రి తలసాని

టైలరింగ్ వృత్తి చేసుకునే యువతకు క్రికెట్ లీగ్: మంత్రి తలసాని

సీఎం కేసీఆర్ క్రీడల  అభివృద్ధి కి ఎంతో  కృషి చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో వివిధ క్రీడలలో అద్భుతంగా రాణిస్తూ.. రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న మేర క్రికెట్ లీగ్ ను మంత్రి తలసాని ప్రారంభించారు.

సమాజంలోని సామాజిక వర్గాల వారిని ఒకే తాటిపై తీసుకువచ్చేందుకు ఇలాంటి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని మంత్రి తలసాని తెలిపారు. 20-20 క్రికెట్ కు ఎంత క్రేజ్ ఉందో ఇదే తరహాలో మేరు యువత కలర్ ఫుల్ డ్రెస్ కోడ్ లతో ఈ పోటీలలో పాల్గొనడం అభినందనీయమని మంత్రి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టైలరింగ్ వృత్తి చేసుకునే యువతను ఒక్కతాటిపై తెచ్చేందుకు ఈ క్రికెట్ లీగ్ నిర్వహిస్తున్నట్లు మేరు సంఘం నాయకులు తెలిపారు.