హైదరాబాద్: అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్నగర్ నియోజకవర్గంలోని కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన మహోత్సవంలో పాల్గొన్నారు. మాజీ సీఎం చంద్రబాబు పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు.
‘అధికారంలో ఉన్నామని వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం బాధాకరం. అమీర్పేట లో టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తం. 1994లో ఎన్టీఆర్ తనకు రాజకీయ జీవితం ప్రసాదించిన మహనీయుడు. ఆయన్ను ఎన్నటికీ మరవను’ అని తలసాని స్పష్టం చేశారు.