ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేస్తున్నం

ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేస్తున్నం

హైదరాబాద్: ప్రజా సమస్యల పరిష్కారమే అభివృద్ధిగా టీఆర్ఎస్ పని చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గం, బన్సీలాల్ పేట్ డివిజన్ భోలక్ పూర్ లో తలసాని పర్యటించారు. అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్తీల్లో ఉన్న రోడ్లు, డ్రైనేజ్, విద్యుత్, డ్రింకింగ్ వాటర్ తోపాటు పరిశుభ్రతపై మంత్రి ఆరా తీశారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అక్రమ పార్కింగ్ కు సంబంధించిన ఇబ్బందులను బస్తీ వాసులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు.

మరిన్ని వార్తల కోసం: 

ఐసోలేషన్ పేషెంట్లకు యోగా క్లాసుల లింకులు

బస్సులు, రైళ్లలో ఫుల్ రష్

మీ శాలరీని మీరే పెంచుకోవడం ఎలా ?