- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధీమా
సికింద్రాబాద్, వెలుగు: మల్కాజిగిరి లోక్సభ సీటు కాంగ్రెస్దేనని, మరోసారి మూడు రంగుల జెండా ఎగరవేయడం ఖాయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం శుక్రవారం తిరుమలగిరిలో జరిగింది. మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీతామహేందర్ రెడ్డితో కలిసి మంత్రి తుమ్మల పాల్గొని మాట్లాడారు. మల్కాజిగిరి నుంచి గెలిచి, రేవంత్రెడ్డి సీఎం స్థాయికి ఎదిగారని గుర్తుచేశారు. మరోసారి కాంగ్రెస్ గెలుపు ఖాయమని, బీఆర్ఎస్, బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు.