
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. డిసెంబర్ 29వ తేదీ శుక్రవారం మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డిలు మేడిగడ్డను పరిశీలించేందుకు మరికాసేపట్లో బయల్దేరి వెళ్లనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రులకు అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ.. అక్టోబర్ 21న మేడిగడ్డ పిల్లర్ కుంగింది. అప్పటి నుంచి మేడిగడ్డ కుంగిని ఘటనపై మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక్కమాట కూడా మాట్లాడలేదిని విమర్శించారు. మూడేళ్లలోనే ప్రాజెక్టు కుంగడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. ఎవ్వరు కట్టారో వారే బాధ్యత వహించాలని.. అన్ని విషయాలు నిర్ధారణ చేస్తాం.. నిజాలు వెల్లడిస్తామని అన్నారు.
మేడిగడ్డ కుంగిన ప్రాంతానికి ఇరిగేషన్ అధికారులు ఎవరినీ అనుమతించడంలేదు. మేడిగడ్డ రెండు వైపుల బ్యారేజీని ఇరిగేషన్ అధికారులు మూసేశారు.ఇటీవల మంత్రులు కుంగిన ప్రాంతాన్ని చూపిస్తామని చెప్పారు. అయితే, అధికారులు మాత్రం ఎవ్వరినీ బ్యారేజీ వద్దకు అనుమతించడం లేదు.