మేడిగడ్డ మరమ్మతులకు సిద్ధం.. NDSA రిపోర్ట్ వచ్చాకే రిపేర్లు : ఉత్తమ్

మేడిగడ్డ మరమ్మతులకు సిద్ధం.. NDSA రిపోర్ట్ వచ్చాకే  రిపేర్లు : ఉత్తమ్

మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే  ఎన్డీఎస్ఏ కమిటీ  రిపోర్ట్ వచ్చేవరకు ఎలాంటి రిపేర్లు చేయబోమన్నారు.  రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకే ఎన్డీఎస్ఏ కమిటీ పర్యటిస్తుందని  తెలిపారు. మార్చి 7న ఉదయం మెడిగడ్డ, అనంతరం అన్నారం, రాత్రి రామగుండం ,మార్చి8న సుంధిల్ల బ్యారేజి విసిట్ ఉంటుందన్నారు.  NDSA కమిటీకి పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం వద్ద ఉన్న అన్ని డాక్యుమెంట్స్ NDSA కమిటీకి ఇవ్వాలని కోరారు.  ఎవరైనా NDSA కమిటీ కి సహకారం ఇవ్వకపోతే, డాక్యుమెంట్స్ దాచితే కటినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.  బ్యారేజి డ్యామేజ్ కి కమిటీ  రీజన్స్ చెప్పాలన్నారు.  సమస్యకు కారణం ఎవరు అనేది అడిగామని.. వర్షాలు రాకముందే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో చెప్పాలన్నారు.

టెస్టుల కోసం ప్రపంచంలో  అత్యాధునిక టెక్నాలజీ వాడాలని కమిటీకి సుచించామని చెప్పారు ఉత్తమ్.  రిపేర్ చేసి మళ్ళీ అందుబాటులోకి వస్తే రాష్ట్రానికి మంచిదన్నారు.  వర్షాకాలంకు ముందే అందుబాటులోకి ఇంకా  మంచిదని చెప్పారు.  ENC నాగేందర్ ఆధ్వర్యంలో అయ్యర్ కమిటీ పర్యటిస్తుందన్నారు.

ALSO READ :- రైతులకు గుడ్ న్యూస్: అకౌంట్లలో డబ్బులు పడ్డాయి చెక్ చేసుకోండి..!

NDSA ప్రాథమిక రిపోర్ట్ రాగానే తప్పులు ఉంటే నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకుంటామని చెప్పారు ఉత్తమ్.  ఎల్ అండ్ టీ  రాష్ట్రంలో అనేక వ్యాపారాలు చేస్తోంది.  తాము చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నాం. నిర్మాణ సంస్థకు భాధ్యత ఉండాలి . జుడిష్యల్ ఎంక్వైరీపై త్వరలోనే ముందడుగు ఉంటుందని తెలిపారు మంత్రి ఉత్తమ్.