
సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలో పర్యటించారు మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి. మండలంలోని జాన్ పహాడ్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ఉత్తం కుమార్ రెడ్డి. జాన్ పహాడ్ ఎత్తిపోతల పథకానికి జాన్ పహాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ గా నామకరణం చేశామని అన్నారు. ఈ పథకం కి మూడు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసామని.. ఈ ప్రాజెక్ట్ ద్వారా పది వేల ఎకరాలు సాగు అవుతుందని అన్నారు. గోదావరి నదిపై ప్రాజెక్టు కట్టి ఉంటే బనకచర్ల వివాదం ఉండేది కాదని అన్నారు మంత్రి ఉత్తం.
Also Read : గిగ్ వర్కర్లకు బోర్డు ఏర్పాటుతో పాటు ది బెస్ట్ పాలసీ తీసుకొస్తాం
ఇప్ప్పటిదాకా మూడు సార్లు వచ్చి జాన్ పహాడ్ పనులను పరిశీలించామని.. పనులు వేగవంతం చేయకుంటే కాంట్రాక్టర్, చీఫ్ ఇంజనీర్ల మీద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి ఉత్తం. పనులు పూర్తి అయితే ఈ ప్రాంతం సస్య శ్యామలం అవుతుందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల తెలంగాణ ప్రాంతం దెబ్బతిన్నదని అన్నారు ఉత్తం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 281 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిందని అన్నారు.రైతు భరోసా కింద తొమ్మిది వేల కోట్ల రూపాయలు మంజూరు చేసామని అన్నారు.
లక్షలు కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కడితే కూలిపోయిందని.. ఇరిగేషన్ మీద పదహారు కోట్ల రూపాయలు అప్పు కడుతున్నామని అన్నారు ఉత్తం. హరీష్ రావు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నాడని.. హరీష్ రావు జోసబ్ గోబెల్స్ రావు గా నామకరణం చేసుకోవాలని అన్నారు మంత్రి ఉత్తం.