ఇంత మందికి వ్యాక్సిన్ ఒకేసారి ఇవ్వడం ఓ చరిత్రే..!

ఇంత మందికి వ్యాక్సిన్ ఒకేసారి ఇవ్వడం ఓ చరిత్రే..!

కామారెడ్డి జిల్లా :  10 నెలలుగా ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టిన కరోనాకు వ్యాక్సిన్ ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు తెలిపారు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి. తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా విధి నిర్వహణలో పాల్గొన్న పోలీసులకు, పారిశుధ్య కార్మికులకు, డాక్టర్లకు, అధికారులకు ధన్యవాదాలు అన్నారు. కామారెడ్డి జిల్లాలో కరోనా పరీక్షలు నిర్వహించిన వారిలో 22% ఉన్న పాజిటివ్ కేసులు ప్రస్తుతం 0.34 శాతానికి తగ్గపోయాయన్నారు.

భారత ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇంత మందికి వ్యాక్సిన్ ఒకేసారి ఇవ్వడం చరిత్రలో ఇప్పటివరకు జరగలేదన్నారు. మొదటి విడత వాక్సిన్ పంపిణీలో దేశంలోని 3 కోట్ల మంది ప్రంట్ లైనర్ లకు (వైద్య సిబ్బందికి, పోలీసులకు, పారిశుధ్య కార్మికులకు, 50 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి) ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

రాష్ట్రంలో 15 లక్షల మందికి, కామారెడ్డి జిల్లాలో 12,000 మందికి మొదటి విడతలో ఇవ్వడం జరుగుతుంది. వాక్సిన్ పంపిణీకి జిల్లాలో 30 కేంద్రాలను ఏర్పాటు చేసి, 60 మంది వైద్య సిబ్బందిని నియమించామని..జిల్లాలో 1200 వాయిల్స్ 26 కేంద్రాల్లో భద్రపరిచేందుకు అధికారులు కావాల్సిన ఏర్పాట్లు చేశారన్నారు. భారత్ బయోటెక్ వారు తయారు చేసిన కో వ్యాక్సిన్, సీరం ఫార్మా వారు తయారు చేసిన కోవిశీల్ వాక్సిన్ లు మాత్రమే మనం వాడుతున్నామన్నారు. ఎవరికైనా వాక్సిన్ వికటిస్తే.. వారికి ఎఈఎఫ్ ఐ అనే రియాక్షన్ కిట్లను అందుబాటులో ఉంచుతామన్నారు. మొదటి విడత వాక్సిన్ ఇచ్చిన 28 రోజుల తర్వాత రెండవ విడత ఇవ్వడం జరుగుతుందని, రెండవ విడత ఇచ్చిన 14 రోజుల తర్వాత మూడవ విడత ఇస్తామన్నారు