
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. గజ్వేల్ సెగ్మెంట్లో 3500 ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు. రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తామని తెలిపారు. ఇందిరమ్మ హయాంలోనే పేదలకు భూమి పంపిణీ, ఇపుడు కాంగ్రెస్ హయాంలోనే పేదలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు వివేక్
పేదలకు ఇండ్ల నిర్మాణమే లక్ష్యంగా కాంగ్రెస్ పాలన నడుస్తోందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గరీబీ హఠావా నినాదంతో పేదల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. వారం పది రోజుల్లో అందరికీ రైతు భరోసా నిధులు జమ అవుతాయని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్నా సంక్షేమ పథకాల అమలు చేస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా పేదలను ఆదుకుంటామని చెప్పారు వివేక్.
ఇటీవల రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వివేక్ వెంకటస్వామి. ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. ఈ క్రమంలోనే గజ్వేల్ లో పర్యటిస్తున్న ఆయనకు నియోజకవర్గ కాంగ్రెస్ నేతల నుంచి ఘన స్వాగతం లభించింది.