హైదరాబాద్,వెలుగు: ఎవరికీ చెప్పకుండా బంధువు డెబిట్ కార్డు వాడి ఐ ఫోన్ కొన్న మైనర్ ను మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోయిన్పల్లికి చెందిన ఓ మైనర్(16) ఇంటర్ చదువుతున్నాడు. నవంబర్ 10న ఫ్లిప్ కార్ట్లో రూ.60 వేలు విలువ చేసే ఐ ఫోన్ బుక్ చేశాడు. డెలివరీ టైమ్కి క్యాష్ లేకపోవడంతో తన అత్తయ్య డెబిట్ కార్డ్తో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు. అమౌంట్ ట్రాన్స్ఫర్ విషయం తండ్రితో పాటు ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదు.
ఫ్లిప్ కార్ట్కి అకౌంట్ మనీ ట్రాన్స్ ఫర్ జరిగినట్లు గుర్తించిన మైనర్ వాళ్ల అత్త సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేసింది. పోలీసులు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేశారు.అమౌంట్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ పంపించాలని ఫ్లిప్కార్ట్కి పోలీసులు లెటర్ రాశారు. ఫ్లిప్ కార్ట్ నుంచి డెలివరీ అయిన ఐ ఫోన్ ఐఎంఈఐ నంబర్ ఆధారంగా మైనర్ వద్ద ఉన్న మొబైల్ ను గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. పేరెంట్స్ సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు .