అమిత్ షా తెలంగాణ టూర్​లో మార్పు.. నవంబర్17కు బదులు 18న రాక

అమిత్ షా  తెలంగాణ టూర్​లో మార్పు.. నవంబర్17కు బదులు 18న రాక

హైదరాబాద్, వెలుగు : కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 17కు బదులు 18న ఆయన రాష్ట్రానికి వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. అదే రోజు బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా ఆయన విడుదల చేయనున్నారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. 18న ఉదయం 10 గంటలకు గద్వాలలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొంటారు.

మధ్యాహ్నం 12 గంటలకు నల్గొండలో, 2 గంటలకు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభల్లో పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు గ్రేటర్ పరిధిలోని రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో పాల్గొంటారు. ఆ తర్వాత సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్​లో పార్టీ మేనిఫెస్టోను అమిత్​షా రిలీజ్ చేయనున్నారు. ఒకటి, రెండు రోజుల్లో అమిత్ షా టూర్ షెడ్యూల్ అధికారికంగా రానుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.