గ్యాంగ్ రేప్ చేశారన్న బాలిక.. జరగలేదన్న పోలీసులు

గ్యాంగ్ రేప్ చేశారన్న బాలిక.. జరగలేదన్న పోలీసులు

ఉత్తర ప్రదేశ్‌లో అమానుష ఘటన వెలుగుచూసింది. ఇంట్లో నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన రాంపూర్‌లో ఆగష్టు 22 ఆదివారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక ఇంటి ముందున్న వరండాలో నిద్రిస్తుండగా.. అయిదుగురు వ్యక్తులు వారి ఇంట్లోకి ప్రవేశించి.. బాలికను ఎత్తుకెళ్లారు. బాలిక అరవకుండా నోట్లో గడ్డలు కుక్కి.. ఓ నిందితుడికి చెందిన దగ్గర్లోని షాపుకు తీసుకెళ్లారు. అక్కడు బాలిక మీద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అపస్మారకస్థితిలో ఉన్న బాలికను.. ఆమె ఇంటి సమీపంలో పడేసి వెళ్లారు. స్పృహలోకి వచ్చిన తర్వాత బాలిక జరిగిన విషయాన్ని తన తండ్రికి తెలిపింది.

మరుసటి రోజు ఉదయం బాలిక తండ్రి రాంపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘ఐదుగురు యువకులు మా ఇంట్లోకి ప్రవేశించి నా కుమార్తెను ఎత్తుకెళ్లారు. నోట్లో గుడ్డలు కుక్కి.. నిందితులకు చెందిన ఒక షాపుకు తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అపస్మారక స్థితిలో ఉన్న నా కూతురును మా ఇంటి దగ్గర్లో పడేశారు. స్పృహలోకి వచ్చిన తర్వాత జరిగిన ఘటన గురించి తెలిపింది’ అని ఆ బాలిక తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

మొత్తం ఐదుగురు నిందితులపై ఎస్సీ, ఎస్‌టి మరియు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు రాంపూర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ అంకిత్ కుమార్ తెలిపారు. వారిలో ఒక నిందితుడిని విచారణ కోసం ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. బాధితురాలికి చేసిన వైద్య పరీక్షలో లైంగిక వేధింపులు నిర్ధారణ కాలేదని ఆయన చెప్పారు. బాలిక వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు నమోదు చేస్తామని ఆయన చెప్పారు. పోలీసులు చేసిన విచారణలో.. బాలికకు నిందితులలో ఒకరితో సంబంధం ఉన్నట్లు తేలిందని ఎస్పీ చెప్పారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని ఆయన తెలిపారు.