
- హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు
మాదాపూర్, వెలుగు: లిక్కర్బాటిల్అడిగితే ఇవ్వనందుకు కోపోద్రిక్తులైన ఇద్దరు మైనర్లు, ఓ యువకుడు కలిసి మరో యువకుడిని చంపేశారు. మద్యం మత్తులో మైనర్ కత్తితో పొడిచి ఈ దారుణానికి పాల్పడ్డాడు. హత్య కేసులో ఇద్దరు మైనర్లతో పాటు యువకుడిని మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
మాదాపూర్ఇన్స్పెక్టర్ కృష్ణ మోహన్ వివరాల ప్రకారం.. మణికొండ ప్రాంతానికి చెందిన సురేశ్, లక్ష్మి దంపతుల కొడుకు జయంత్గౌడ్(18) పదో తరగతి పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడు. గత నెల 30న తల్లి బర్త్డే కావడంతో ఫ్రెండ్స్తో కలిసి ఇంట్లో కేక్ కట్చేశాడు.
అనంతరం ఫ్రెండ్స్తో కలిసి బైక్ పై బయటికి వెళ్లాడు. ఖానామేట్యశోద ఆసుపత్రి వెనుక నిర్మానుష్య ప్రాంతంలో 8 మంది స్నేహితులతో కలిసి మద్యం తాగుతున్నాడు. అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో ఎర్రగడ్డకు చెందిన ఈశ్వర్సింగ్, మరో ఇద్దరు మైనర్లు స్కూటీపై అక్కడికి వచ్చారు. జయంత్గౌడ్ వద్దకు వచ్చి తమకు లిక్కర్ బాటిళ్లు ఇవ్వాలని గొడవ పెట్టుకున్నారు.
ఈ గొడవలో ఓ మైనర్ తన వద్ద ఉన్న కత్తితో జయంత్గౌడ్ పక్కటెముకలు, నడుము భాగంలో పొడిచి పరారయ్యాడు. బాధితుడిని హాస్పిటల్కు తరలిస్తుండగా, మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు ఈశ్వర్సింగ్తో పాటు ఇద్దరు మైనర్లను సోమవారం అరెస్ట్ చేశారు. మైనర్లను జువైనల్హోమ్కు, ఈశ్వర్సింగ్ను రిమాండ్కు తరలించారు. హత్య కేసులో పాల్గొన్న ఓ మైనర్పై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.