పాలకుర్తి, వెలుగు: పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని ఇద్దరు మైనర్లు సూసైడ్ చేసుకున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలానికి చెందిన అబ్బాయి (16 ) గ్రామాల్లో తిరిగి గ్యాస్ స్టౌలు రిపేర్చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన ఇంటి సమీపంలో ఉంటున్న అమ్మాయి(15)తో పరిచయం ఏర్పడడంతో కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెండ్లికి పేరెంట్స్ ఒప్పుకోరని భావించిన ఇద్దరూ శుక్రవారం రాత్రి కాలనీ సమీపంలో ఉన్న ఎర్రమల్లయ్యకుంటకు వెళ్లి పురుగుల మందు తాగారు. అనంతరం ఇద్దరూ ఎవరింటికి వారు వెళ్లారు. అబ్బాయి మృతిచెందగా అమ్మాయి జరిగిన విషయాన్ని ఇంట్లో చెప్పింది. కుటుంబసభ్యులు ఆమెను హాస్పిటల్కు తరలిస్తుండగా దారిలో చనిపోయింది.
For More News..